రాజుగారి తోట గ్రామంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర
నరసాపురం: జనంలోకి జనసేన 6వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం రాజుగారి తోట గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మడి నాయకర్ భరోసా ఇచ్చారు. ఆ గ్రామంలో ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు మరియు రోడ్ల దుస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. రాజుగారి తోటలో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని నాయకర్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, వాతాడి కనకరాజు బందెల రవీంద్ర, గుబ్బల మార్రజు, పెమ్మాడి కిరణ్, వట్టిప్రోలు సతీష్, పోలిశెట్టి నళిని, వలవల సావిత్రి,రాయుడు అవినాథ్, రాయుడు ఆనంద్, రాయుడు ఏడుకొండలు, మద్దూరి హరీష్, బందెల ప్రభు కుమార్ , తేలి బుజ్జిబాబు, కత్తిమండ ఆనంద్, భీమవరపు రామకృష్ణ, ఎలా అజయ్ బాబు, రాజుగారి తోట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-8.38.09-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-8.38.09-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-8.38.10-PM-1024x669.jpeg)