Vizag: జనసేన రాష్ట్ర మత్స్యకార కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మరియు కార్యదర్శులకు ఘనంగా సన్మానం

64 వ వార్డ్ దిబ్బపాలెం జనసేన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మత్స్యకార కమిటీలో నియమితులైన, శ్రీ బొమ్మిడి నాయకర్(చైర్మన్), శ్రీమతి రెయ్యి రత్న (వైస్ చైర్మన్ ), మరియు కదిరి సత్యనారాయణ( కార్యదర్శి) లకు జనసేన నాయకులు, దిబ్బపాలెం జనసేన కమిటీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమములో గాజువాక ఇంచార్జ్ పిఏసి సభ్యులు శ్రీ కోన తాతారావు, 64వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్, 65 వార్డ్ ఇంచార్జ్,
శ్రీమతి రెయ్యి రత్న, జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ శ్రీ కరణం కళావతి, మెగాఫ్యామిలీ చిరంజీవి యువత ఉత్తరాంధ్ర అధ్యక్షులు పౌలురౌత్ వెంకట్ రమణ, 64 వ వార్డ్ జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు మరియు దిబ్బపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.