గాయపడిన జనసైనికునికి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన జనసేన

అమలాపురం, విలసవిల్లి గ్రామానికి చెందిన నందుల దుర్గా వెంకట సత్యనారాయణకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయమై సర్జరీ జరిగింది. క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ లో భాగంగా పార్టీ కార్యాలయం నుంచి పంపిన 30 వేల రూపాయల చెక్కును నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో విలసవిల్లి గ్రామంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు గౌ౹౹ శ్రీ౹౹ పవన్ కళ్యాణ్ కి ఇంచార్జ్ శ్రీ రాజబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల సూర్యనారాయణమూర్తి ఆకుల బుజ్జి, ఆకేటి వెంకన్న, తూము రమేష్, గొలకోటి వెంకటేష్, గొలకోటి తాతాజీ, ఆకేటి శ్రీనివాసరావు, ఆకుల బాబులు, ఆకేటి పల్లపురాజు, శిరంగు పద్మనాభం, ఆకేటి సన్నీ, అత్తిలి సురేష్ నాయుడు, నల్లా హరి, నందుల రంగారావు, నందుల నాగు, నందుల ప్రతాపనంద, పొలిశెట్టి సూరిబాబు, నందుల చిన్న, దంగుడుబియ్యం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.