భూమి కోసం ధర్నా చేస్తున్న దళితులకు మద్దతుగా జనసేన

భైంసా, గత 11 రోజులుగా భూమి సాగు కోసం భైంసా మండల మహగం గ్రామ దళితులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని చెప్పి కొందరూ అనహర్హులకు, రాజకీయ అండతో భూమిని ఇచ్చి మిగితా దళిత కుటుంబాలకు అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వ భూమి 218 గల సర్వేలో సాగుచేస్తామని వెళ్తే అడ్డుకుంటున్నారు. సాగు చేయాలనే భూమిలో ఇప్పటికే కొందరు ప్రభుత్వాన్ని మోసం చేసి పట్టాలు చేసుకున్నారు. ఆ భూమిపై కొందరి దళారుల కన్ను పడి అన్యాక్రాంతం అవుతుంది. దాన్ని కాపాడాలని, ఎన్నో సంవత్సరాలుగ ఒక్క గంట భూమి లేక ఇక్కడే నివసిస్తున్న వీరికి మాత్రం భూమి ఇవ్వడంలేదు. కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వ భూమిలో దున్ను కొని పంట సాగుచేసుకోవడనికి అన్ని హర్హతలు వున్న వీరికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వీరి పోరాటానికి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిదులు మద్దతుగా వుండాలని కోరుతూ ఆందోళన తీవ్ర స్థాయిలోకి వెళ్ళక ముందే సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము అని తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాహెబ్ రావ్, జనసైనికులు, గ్రామ దళితులు ఆనంద్, గంగాధర్, భీం రావ్, శంకర్, బాబు, కమల, లక్ష్మి, పంచపుల తదితరులు పాల్గొన్నారు.