సిరిపురం శివారులో టిడ్కో ఇళ్ళు పరిశీలించిన జనసేన

తెనాలి నియోజకవర్గం, నేలపాడు గ్రామం సిరిపురం శివారులో(ఫేస్-2) లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు జరుగుతుంది. శనివారం మొదటి రోజు నేలపాడు గ్రామంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా కమిటీ సభ్యులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ బేగ్, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొప్పుల కిరణ్, కొర్రపాటి నాగేశ్వరావు, చట్టాల త్రినాధ్, ముమ్మాలానేని సతీష్ తెనాలి నాయకులు గుంటూరు కృష్ణ మోహన్, కొల్లిపర మండలం అధ్యక్షులు యార్రు వెంకయ్య నాయుడు, తెనాలి మండలం అధ్యక్షులు దివ్వెలా మధుబాబు, కొల్లిపర సత్యనారాయణ,వేణు, జగర్లమూడి ఎంపిటిసి పసుపులేటి వెంకటేశ్వరావు, తెనాలి మండల ప్రధాన కార్యదర్శి రాగం గోపిచంద్, బెల్లపు యస్వంత్ కుమార్, గోవిందలపూడి కృష్ణ, పతేల్లా మల్లి మరియు జనసైనికులు పాల్గొన్నారు.