ప్రియాంకను పరామర్శించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ప్రేమ పేరుతో చిత్రహింసకు గురై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియాంకను ఆదివారం రాత్రి జనసేన ఏలూరు నియోజకవర్గం ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, నిజాలునిగ్గుతీసి, నిందితుడిని శిక్షించాలని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.