దయనేడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని జనసేన వినతి

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలం, పిల్లమేడు పంచాయతీ లోని దయనేడు గ్రామంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు పర్యటించిన సందర్భంగా గ్రామంలోని ప్రజలు ప్రధానంగా తెలియజేసిన సమస్య గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం లేదని. గురువారం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ ని కలిసి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం తక్షణమే కల్పించాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ త్వరలోనే బస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య నాయకులు రవి కుమార్ రెడ్డి, మణికంఠ పాల్గొన్నారు.