ఇంటింటికీ జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల త్రిశూల వ్యూహం

రాజానగరం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం చిన్నకొండెపూడి గ్రామంలో ఉదయం నుండి ఉదృతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రతీ ఇంటికీ తిరుగుతూ…ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రజా పరిపాలన తీసుకురావడానికి.. మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన – తెలుగుదేశం -బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్దించిన రాజానగరం నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, నా సేన కోసం నా వంతు కమిటీ మెంబెర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.