మైలవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

బడుగు బలహీన వర్గాల విద్యోన్నతికి కృషిచేసిన మహా ఉద్యమ నేత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు (గాంధీ) ఆధ్వర్యంలో కొండపల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి పూలే అన్నారు. ఆయన చేసిన ఉద్యమాలు అన్ని తరాల వారికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి నాని, సామల సుజాత, రాగాల నాని, యర్రంశెట్టి సాయి, పగిడిపల్లి వెంకట్, రామంజనేయులు, చరణ్, టి. రాజేష్, రాజేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.