ప్రమాద బాధితులకు ఆర్ధికసాయమందించిన కువైట్ ఎన్నారై అగ్నికుల క్షత్రియ సేవా సంఘం

నరసాపురంలో కువైట్ ఎన్నారై అగ్నికుల క్షత్రియ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా ఇటీవల నరసాపురంలో రోడ్డు ప్రమాదాలకు గురయి భీమవరం ఇంపీరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమజ్యోతి కుటుంబ సభ్యులకు 20 వేల రూపాయలు అలాగే భీమవరం రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవ్య కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కువైట్ ఎన్నారై అగ్నికుల క్షత్రియ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు తిరుమాని దుర్గాప్రసాద్, మోకా ఏడుకొండలు వర్మ, కొప్పాడి శ్రీను, తిరుమాని శ్రీను, తిరుమాని చిట్టిబాబు, తారాడి శివ, కొప్పాడి విజయ్, వాతాడి రమేష్, కొపనాతి భీమరాజు, వాటాల రామారావు, నరసాపురం నియోజకవర్గ అగ్నికుల క్షత్రియ నాయకులు, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.