పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకుందాం: సుజయ్ బాబు

నెల్లూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఆ డివిజన్ ఇంచార్జ్ అత్తులూరి సౌమ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సుజయ్ బాబు విచ్చేసి మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు . వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు నేరుగా వెళ్లి వివరించి జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించమని కోరాలని అన్నారు. డివిజన్ ఇంచార్జ్ సౌమ్య మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ఉన్న తనను 24వ డివిజన్ ఇన్చార్జిగా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డికి, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి కాంతర్ నగర డివిజన్ ఇన్చార్జిలు రేవంత్, షఫీ, ఇంతియాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.