కరోనాతో మహాత్మగాంధీ మునిమనుమడు మృతి

కరోనాతో మహాత్మా గాంధీ మనవడు సతీష్ ధుపేలియా (66) కన్నుమూశారు. న్యూమోనియా కారణంగా నెలరోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మరణించినట్లు ఆయన సోదరి ఉమా ధుపెలియా-మెస్త్రీ తెలిపారు. ‘నా సోదరుడు సతీష్ ధుపేలియా న్యూమోనియాతో బాధపడ్డాడు. అసుప్రతిలో చేరగానే అతనికి కోవిడ్ సోకింది. ఆదివారం సాయంత్రం తనకు గుండెపోటు రావడంతో మృతి చెందాడు’అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సతీశ్ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్​మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. సతీశ్ ధుపేలియా తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా రంగంలోనే గడిపారు. వీడియో, ఫోటో గ్రాఫర్​గా పని చేశారు.