జనసేన పార్టీలో పలువురి చేరిక
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఎస్.వి.కే కళ్యాణమండపం నందు శుక్రవారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఇన్ ఛార్జ్ భైరవ ప్రసాద్ అద్యక్షతన, మహబూబ్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 30 మంది పార్టీలో చేరడం జరిగింది. వీరిని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, పవన్ కళ్యాణ్ పెట్టిన సిద్ధాంతాలు మరియు ఆయన చేస్తున్న పోరాటం నచ్చి మేము పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. “పవన్ రావాలి పాలన మారాలి” ఆన్న సిద్ధాంతంతో పని చేస్తామని వారు పేర్కొన్నారు. నిన్నటి రోజు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ భైరవ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మరియు ఇన్ ఛార్జ్ మాట్లాడుతూ పార్టీ క్రియాశీలక సభ్యత్వం మండల కమిటీల బలోపేతం చేయడం పైన వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనురాధ, వీరమహిళ శ్రీ మతి లక్ష్మి మరియు మండల కన్వీనర్లు చలపతి, మహేష్, రమణ, చౌదరి, రవీంద్ర నాయక్, లక్ష్మణ్, శ్రీనివాసులు, చక్క రమణ, అంజిబాబు, గణేష్, నాగేంద్ర, రెడ్డి, వంశీ, భాస్కర్, రవి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.