జనసేన పార్టీలోకి పలువురు చేరిక

రాజానగరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు, ఆశయాలు నచ్చి.. రాజానగరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రజలకు చేరువగా ఉంటూ నిత్యం వారి క్షేమం కోసం పరితపించే తత్వం నచ్చి వారి సమక్షంలో రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన వడ్డి వెంకట అప్పారావు, ప్రగడ సత్తిబాబు, గటిం శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.