పథకాలు వద్దు – గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు ఇవ్వండి!!

శ్రీకాళహస్తి, 69 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో “జనసేన విజయ యాత్ర- ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్” కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి మండలం, పాపానపల్లి, ఎల్లంపల్లి గ్రామాల్లో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటాని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పుకోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. త్రాగు నీరు సమస్య, బస్సు సౌకర్యం లేదు, డ్రైనేజ్ కాలువలు, స్ట్రీట్ లైట్లు సమస్యలు ప్రజలు తెలిపారు, ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని వినుత హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఉపాధ్యక్షులు కావలి శివకుమార్, ప్రధాన కార్యదర్శి ముడుసు గణేష్, జనసైనికులు కామప్రసాద్, చందు, సుబ్రమణ్యం, కె. సుబ్రమణ్యం, వెంకట రమణ, ప్రశాంత్, నాయకులు, పేట చంద్ర శేఖర్, జ్యోతి రామ్, పేట చిరంజీవి, లక్ష్మి, శారద, గురవయ్య, సురేష్, హేమంత్ గౌడ్, గురవయ్య, చిన్న మునయ్య, జనసైనికులు దినేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.