నెంబర్ వన్@ట్విటర్: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో దూసుకుపోతున్నారు. ట్విటర్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయర్లు ఉన్న క్రియాశీలక రాజకీయవేత్త (యాక్టివ్ పొలిటిషియన్)గా నెంబర్ వన్ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు.
మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా తొలిగించింది. దీంతో ప్రధాని మోదీకి 6.47 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లతో మొదటి స్థానంను దక్కించుకున్నారు.
క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు. ఆయన ఖాతాను 12.79కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్కు ప్రస్తుతం 2.33 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారు.