రాజశ్యామల యాగశాలను దర్శించిన పంచకర్ల సందీప్

తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో 22-11-2023 నుండి 27-11-2023 వరకూ అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో జరుగుతున్న శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం వీక్షించుటకు యాగశాలను గురువారం భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ కు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ ఘన స్వాగతం పలకడం జరిగింది.