అల్లుడి సక్సెస్ కి పవన్ గెస్ట్ రోల్
వరుస విజయాలతో సక్సెస్ల బాట పట్టిన మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ తాజాగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. కొత్త నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రంలో సాయిధరమ్తేజ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారట. కాగా ఇందులోని ఓ పవర్ఫుల్ అతిధి పాత్రలో పవన్కల్యాణ్ కనిపించబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. దేవా కట్టా `ప్రస్థానం` తరువాత ఆ స్థాయి చిత్రాన్ని అందించలేకపోయారు. దీంతో ఈ సినిమాతో హిట్ ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో వున్నారట. ఇందు కోసం పవన్ని గెస్ట్ రోల్లో నటించమని దర్శకుడుసంప్రదించారని, పవన్ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారని చిత్ర వర్గాల సమాచారం.