పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం ప్రతి ఇంటికి వస్తా: తుమ్మల బాబు

పెద్దాపురం, జనసేన పార్టీ ఆద్వర్యంలో పెద్దాపురం పట్టణంలో పవన్ రావాలి – పాలన మారాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ పెద్దాపురం ఇన్చార్జి తుమ్మల రామస్వామి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత పెద్దాపురం మెయిన్ రోడ్ లో వినాయకుని గుడి, దాసాంజనేయ స్వామి మరియు మరిడమ్మ తల్లి గుడి సన్నిధిలో తుమ్మల రామస్వామి తన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని, పెద్దాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని కోరుతూ మర్యాద పూర్వకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ప్రముఖలను తుమ్మల రామస్వామి ఆద్వర్యంలో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అడ్డా అని పేర్కొన్నారు. గతంలో పెద్దాపురం నుంచి పిఆర్పీ అభ్యర్థి విజయం సాధించారని, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అన్నింటా వైఫల్యం చెందేలా పాలన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణం అధ్యక్షులు పొలమరశెట్టి సత్తిబాబు, మండల అధ్యక్షులు దాసు శివబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, తమనార లక్ష్మణ్ దివాకర్, వంగలపూడి సతీష్, ఒబిలిశెట్టి గణేష్, నున్న భాస్కరరావు, గోపు వల్లయ్య, తుమ్మల బుల్లియ్య, నామా సతీష్, పిట్టా జానకీ రామారావు, సరోజ్ వాసు, పెంకే సత్యవతి, కంచుమర్తి రాజన్న, తోట శివ, చల్లా వెంకటేష్, పబ్బినీడి ఈశ్వరరావు, కఠారి శ్రీనివాసరావుతో పాటు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.