జనసేన, టిడిపిల ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిపై నిరసన

జగ్గంపేట నియోజకవర్గం: జగ్గంపేటలో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని జనసేన టిడిపి పార్టీల ఆధ్వర్యంలో గండేపల్లి మండలం, మల్లేపల్లి గ్రామం నుండి సుబ్బయ్యపేట వరకు మరియు గండేపల్లి నుండి రామయ్యపాలెం వరకు పాదయాత్ర చేసి సంయుక్త నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చాలా అధ్వానంగా ఈ రోడ్డను ఏ నాయకుడు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదష్టకరం అని అసహనం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఇలాంటి రోడ్లపై వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి వెళ్ళాలంటేనే చాలా భయపడుతున్నారని చెప్పారు. అంతే కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన నెల రోజులలోనే అన్ని రోడ్లు నిర్మించే ప్రక్రియ మొదలు పెట్టి పక్కా రోడ్లుగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.