‘రాధేశ్యామ్’.. కొత్త నిర్ణయం!

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాధేశ్యామ్. బాహుబలి సాహో వంటి యాక్షన్ స్క్రిప్టుల తర్వాత.. లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు రెబల్ స్టార్. ఈ చిత్రం షూట్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. విడుదల కోసం జూలై 30న స్లాట్ కూడా బుక్ చేశారు. కానీ.. కరోనా కండీషన్ తో ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.ఈ చిత్రం రీషూట్ కు వెళ్లనుందని కొంత కాలంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్-పూజాహెగ్డే నడుమ వచ్చే రొమాంటిక్ సాంగ్ పెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ షూట్ చేద్దామని ప్రభాస్ ప్రపోజల్ పెట్టాడని వార్తలు వచ్చాయి. దీనికి మేకర్స్ ఓకే చెప్పారని టాక్. ఎలాగో షూట్ చేస్తున్నాం కాబట్టి.. అనుకున్నట్టుగా రాని కొన్ని సీన్లను కూడా రీషూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఈ మేరకు ఓ పది రోజుల షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే.. ఆ మధ్యనే షూట్ కంప్లీట్ చేసేవారు. ఇప్పుడు తీవ్రత కాస్త తగ్గుతున్నట్టు కనిపిస్తుండడంతో.. షూట్ కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. షూటింగులు ఓపెన్ కాగానే.. రీషూట్ కంప్లీట్ చేసి ప్యాచ్ వర్క్ ఫినిష్ చేస్తారట.

ఇదిలాఉంటే.. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడి జనాలు థియేటర్లకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ నెలలోనైతే దాదాపు అసాధ్యంగానే ఉంది. అందువల్ల రాధేశ్యామ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిపోవడం ఖాయంగా వినిపిస్తోంది. అయితే.. జూలై ఆగస్టులో కాకుండా డైరెక్టుగా దసరాకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పనులన్నీ ప్రశాంతంగా ఫినిష్ చేసుకొని పండగ సీజన్ లో రావాలని చూస్తున్నారట. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది చూడాలి.