గోపాలస్వామి సేవలో జక్కన్న

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బార్యా సమేతంగా దైవ దర్శనాలతో బీజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం ఆయన తన భార్య రమతో కలిసి కర్ణాటకలోని చామరజనగర్ జిల్లాలోని హిమవద్ గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా కరోనా బారిన పడిన రాజమౌళి కుటుంబం కొద్ది రోజుల క్రితం ఆ వైరస్ నుంచి కోలకుని విజయవంతంగా బయటపడ్డారు. ఈ నేపధ్యం లో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు జక్కన్న ఆలయ సందర్శన చేస్తున్నట్లు తెలుస్తోంది.