విజయోత్సవ సభను తలపించిన రాజానగరం జనసేన – టిడిపి ఉమ్మడి ఆత్మీయ సమావేశం

  • రాజానగరం, సీతానగరం గ్రామంలో జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం అత్యంత విజయవంతం
  • ఒకే వేదికపై ఇద్దరు నాయకులను చూసి హర్షం వ్యక్తం చేసిన ఇరు వర్గాల పార్టీ శ్రేణులు
  • 100% పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో జివికె కన్వెన్షన్ హాల్లో రాజానగరం నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీల మొదటి ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సీతానగరం మండల నాయకులు నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని గజమాలతో సత్కరించారు. రానున్న ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గంలో జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అత్యంత మెజారిటీతో గెలిపించుకుందామని బొడ్డు వెంకటరమణ చౌదరి తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే ఈ అరాచక వైసిపి ప్రభుత్వం పోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సరైన సమయంలో పొత్తు పెట్టుకున్నారు, రాజానగరం నియోజకవర్గంలో అవినీతి, అరాచక, దుర్మార్గపు పాలన చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమార్జనతో, అధికారం మదంతో ఉన్న వైసీపీ నాయకులను తరిమికొట్టి రాజానగరం నియోజకవర్గ సంపదను రక్షించుకుందాం, అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు సుపరిపాలనతొ సమన్యాయం చేద్దాం, ఎన్నికల సమయం తక్కువ ఉన్నందున అందరూ మరింతగా కసిగా, కష్టపడాలని ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తుల – బొడ్డు పిలుపునివ్వడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో జివికె కన్వెన్షన్ హాల్లో జరిగిన రాజానగరం నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీల మొదటి ఉమ్మడి ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుండి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా తరలి రావడంతో శ్రేణుల కేరింతల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.