కార్తీక వనసమాధనలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

  • ఏలూరు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం

ఏలూరు నియోజకవర్గం: దెందులూరు మండలం, గోపన్న పాలెం శివారు (సానిగూడెం అడ్డరోడ్డు) కూనంశెట్టి ధనుంజయ రావు, పాతే రాంబాబు తోటలో జరిగిన ఏలూరు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారి కార్తీక వనసమాధనలో ముఖ్య అతిథిగా పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. ఈ వనసమాధన కార్యక్రమంలో తూర్పు కాపు అధ్యక్షులు లంక వెంకట రామ్మోహన్ రావు, కార్యదర్శి అలజింగి శ్రీనివాసరావు, కోశాధికారి కరణం రామ్మోహన్ రావు, యువత అధ్యక్షులు అట్టాడ రామకృష్ణ, యువత కార్యదర్శి సరిది రాజేష్, యువత కోశాధికారి యాగాటి లక్ష్మీ నారాయణ, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.