మద్యం షాపు ముందు ధర్నా నిర్వహించిన శెట్టిబత్తుల రాజబాబు

అమలాపురం పట్టణంలో కొనసాగుతున్న 94వ రోజు మహాసంకల్ప యాత్రలో భాగంగా ఇంటి ఇంటికి ప్రచారం చేసున్న అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబుకి స్థానిక శ్రీరాంపురం నందు ఇళ్ళ మధ్యన ఉన్న ప్రభుత్వ మద్యం షాపు వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి మా సమస్యను చెప్పినా అధికారులు పట్టిచుకోలేదని స్థానిక మహిళలు తమ గోడు విన్నవించుకోగా వెంటనే జనసేనపార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన రాష్ట్ర, జిల్లా నాయకులు, స్థానిక పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు మరియు స్థానిక మహిళలతో పాటు మద్యం షాప్ ముందు ధర్నాకు దిగడం జరిగింది.