జనసేన ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతుల కోసం శ్రమదానం

పాడేరు: అనంతగిరి మండలం, కివర్ల పంచాయతీ పోడెల్తి గ్రామంలో 2017, 2018 సంవత్సరం మహాత్మాగాంధీ ఉపాధి హామీ నిధులతో మట్టి రోడ్డు మంజూరు అయింది ఐతే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మొత్తం కోతకు గురికావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రాకపోకలకు వీలులేకుండా గ్రామస్తులకు ఏదైనా జబ్బుచేసిన అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేని విదంగా తయారయ్యింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, స్థానిక ఎమ్మెల్యేకు తెలియపరిచినా ఎటువంటి ప్రయోజనం లేనందున జనసేన పార్టీ మండల నాయకులు పోడెల బుజ్జిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా నడుం బిగించి రోడ్డు ని శ్రమదానం చేసి మరమ్మతులు చేస్తున్నారు. గతంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై వినతి పత్రాలు ఇచ్చామని కానీ ఎటువంటి స్పందన కనబడకపోవడంతో చేసేదేమిలేక గ్రామస్తులు ఉమ్మడిగా శ్రమించి సాధించుకుందామని ఈ రోజు ఈ పని చేస్తున్నామన్నారు అలాగే అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రశ్నిస్తూ మరీ ఈ ప్రభుత్వ పాలకులు, అధికారులు ఎందుకని ఇందుకోసమేనని ఎద్దేవా చేశారు. కనీసం ఇది చూసైనా అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని, ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు కనీస ఆలోచనైనా చేయాలని ఈ సందర్బంగా జనసేనపార్టీ నాయకులు పొడలి బుజ్జిబాబు గ్రామస్తులు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని కోరారు.