KBC సెట్లో అమితాబ్ను కలిసిన సోనూసూద్
కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి రియల్ హీరోగా కీర్తింపబడుతున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మీలో ఎవరు కోటీశ్వరుడు హిందీ కేబీసీ సెట్లో ప్రత్యక్షమయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోనూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సోనూ బిగ్ బీని ఎందుకు కలిశారంటే… లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలను గుర్తు చేస్తూ రాసిన తన ఆత్మకథ పుస్తకం ఐ యామ్ నో మేసయ్య పుస్తకాన్ని అమితాబ్కు అందించారు. కాగా, పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ పుస్తకాన్ని రీసెంట్గా చిరంజీవికి అందించిన సోనూసూద్ ఇప్పుడు కేబీసీ సెట్స్లో అమితాబ్కు అందించారు.