భామిని మండలంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలంలో జనసేన కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీకి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు, జనసేనికులు పార్టీకి బలమని అందరూ కూడా ఒకే తాటిపై ఉండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు అలాగే ప్రస్తుత ఉన్న పొత్తులు పరిస్థితులపై పవన్ కళ్యాణ్ నిర్ణయమే జనసేన నాయకులు, కార్యకర్తలు నిర్ణయం అవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఇంచార్జ్ గేదెల చైతన్య పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.