శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం: భువనగిరి పల్లెకు చెందిన గ్రామ పెద్దలు గ్రామ యువకులు, జనసైనికుల ఆహ్వానం మేరకు శనివారం భువనగిరి పల్లెలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు భువనగిరి పల్లెకు వెళ్లడం గ్రామ ప్రజలు, యువకులు మరియు జనసేన పార్టీ సైనికులు ఎంతో ఉత్సాహంగా పూర్ణకుంభం మేల తాలాలతో పూలమాలలు వేసి ఆహ్వానించారు. అనంతరం రాజంపేట నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యల్లటూరు శ్రీనివాసరాజు, శింగంశెట్టి నరేంద్ర మరియు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నాయకులు గుణకల చిన్న, గుగ్గిళ్ళ గంగాధర్, గురువుగారి వాసు, కిచ్చగారి శివయ్య, మౌలా, మారయ్య, బాల సాయి, మల్లికార్జున, ఎన్ .హరి, మురళి, రాజా చారి, దర్బార్, హరి మరియు భువనగిరి పల్లి జనసైనికులు మన్నేరు వెంకటసుబ్బయ్య మల్లెం సుబ్బయ్య కోలాటం హరి, నరసింహ, కొండా హరి, నరేష్, నాగరాజు, శంకరయ్య, గుర్రంకొండ నరసింహులు, మల్లికార్జున, రఘుపతి, శివయ్య, సూరి తదితరులు పాల్గొన్నారు.