మార్టేరు గ్రామ పెద్దలతో చేగొండి సూర్యప్రకాష్ భేటీ

ఆచంట, పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో పెద్దలు అడబాల శ్రీనివాస్, పసుపులేటి ప్రసాద్, రామకృష్ణ, నాగ శ్రీనులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చేగొండి సూర్యప్రకాష్, పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తీక్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ముంతాజ్ బేగం ఆలి, మండల నాయకులు బయ్యా బాలాజీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మార్టేరు గ్రామంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి సూచనలు చేయడం మరియు సలహాలు తీసుకోవడం జరిగింది. అలాగే నెగ్గిపూడి గ్రామంలో చల్లా బాలాజీ భార్య అనారోగ్య కారణం చేత స్వర్గస్తులవడంతో వారి కుటుంబాన్ని చేగొండి సూర్యప్రకాష్ పరామర్శించి దైర్యం చెప్పడం జరిగింది. అలాగే సకిలేటి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని వారిని కలసి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిరణ్ నాయుడు, షేక్ అనిఫ్, ఆకేటి మహేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.