టిడిపి, జనసేన టార్గెట్ 2024

  • పక్కా వ్యూహంతో టిడిపి జనసేన ఆత్మీయ సమావేశాలు
  • జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో చల్లా బాబు బేటీ

తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశంపై నగర కమిటీతో భేటీ అయిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జనసేన, టిడిపి సమన్వయంతో పనిచేస్తున్నాయని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయనతో పుంగనూరు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు తిరుపతిలో భేటీ అయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి-జనసేన ఉమ్మడిగా పనిచేసి వైసిపిని ఇంటికి సాగనంపాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని, అందరు నాయకులు కలుపుకొని పోవాలని సూచించారు. ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా చూస్కోవాలన్నారు. ఈనెల 17న పుంగనూరులో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని, అందులో ఉమ్మడిగా చేపట్టవలసిన ఆందోళనలపై చర్చిస్తామన్నారు. టిడిపి జనసేన ఉమ్మడి పోరాటాలతో వైసిపిని గద్దె దింపడం ఖాయమన్నారు. తిరుపతి నగర కమిటీ భేటీ:
మంగళవారం జరగనున్న తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశానికి సంబంధించి మంగళవారం జనసేన నగర కమిటీతో జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. డివిజన్ అధ్యక్షులతో పాటు నగర కమిటీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. టిడిపితో ఉమ్మడిగా చేపట్టవలసిన కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజా రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి , తిరుపతి నగర ఉపాధ్యక్షులు బాబ్జీ, పార్ధు, లక్ష్మీ నరసమ్మ, జిల్లా కమిటీ సభ్యులు హేమకుమార్, ఆనంద్, ముక్కు సత్యవంతుడు, కొండా రాజ మోహన్, మనోజ్ కుమార్, రుద్ర కిషోర్ రెడ్డి, లావణ్య శర్మ, హిమవంతు తిరుపతి నగర కమిటీ, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.