క్రియాశీలక సభ్యత్వం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు, రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎమ్మిగనూరు నియోజకవర్గం విజయవంతం అయిన సందర్భంగా సోమవారం రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీతో ముగిసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్ పనితీరు అభినందనీయం అని కొనియాడారు. వాలంటీర్ కి తోడుగా జనసైనికులు మెగా అభిమానులు నియోజకవర్గ ప్రజలు ఎంతో సహకరించారని వీరి సహకారం వల్ల ఎమ్మిగనూర్ నియోజకవర్గం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతం అయిందని తెలియజేశారు. జనసేన పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.