రోడ్లు సమస్యలపై గళమెత్తిన జనసేన నాయకులు
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం జే.ఆర్.పురం గ్రామం నుండి వయా రావాడ మార్గం వరకు రోడ్డు వేసి ఐదు నెలలు అయ్యిందో లేదో కాని రోడ్లు వెంటనే బీటలు వారాయి. ప్రభుత్వం సరైన నాణ్యమైన మెతల్, తారు వాడకపోవడం వలన ఆతారురోడ్డు పాడైపోయి.. ఆ రోడ్డు గుంతలమయం అయ్యంది. ఈవిషయం తెలిసి కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు పోట్నూరు. లక్ష్మునాయుడు, గోర్లె.రామునాయుడు గళమెత్తారు. ఈ సమస్య ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని రోడ్లు మరామత్తులు చేయించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-01-at-6.25.48-PM.jpeg)