జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ ముఖ్య నాయకులు

నెల్లిమర్ల నియోజకవర్గం: ముంజేరు జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో పేరాపురం వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు రౌతు నర్సింగరావు, వార్డ్ మెంబెర్ రౌతు భాస్కర్ రావు మరియు వారి అనుచర గణం శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పాలనకి విసుగు చెంది పోయమని, నెల్లిమర్లని అభివృద్ధి బాటలో పేట్టే లోకం మాధవి గారితోనే తమ ప్రయాణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లావాని తోట సర్పంచ్ బూర సతీష్, కొలచన రమేష్, కొలచన శరత్, బూర సూరష్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.