దమ్ముంటే జనసేనాని ని టచ్ చేసి చూడండి – సవాల్ విసిరిన తిరుపతి జనసేన

తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన జనసేన. వైసిపి నేతలే విశాఖ గర్జన పేరుతో సభ పెట్టారు. విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైంది. పనికిరాని మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఎయిర్పోట్ కి పవన్ వచ్చే సమయానికే మంత్రులు అక్కడికి వచ్చారు. వైసిపి ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసిపికి లేదు. దమ్ముంటే పవన్ ని టచ్ చేయండి, రాష్ట్రంలో ప్రజలు వైసిపి వాళ్ళని తరిమి కొడతారు. రోజా తమిళనాడులో పెళ్లి చేసుకుంది, అక్కడ రాజధాని పెట్టుకో రోజా అవ్వకి విశాఖలో ఏమి జరిగిందో తెలిసింది కదా, ఇంకోసారి పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించు. పవన్ పై, జనసేన నాయకులపై అక్రమ కేసులు, అసత్య ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతాం. ఎక్కువ చేస్తే బయట తిరగనీయమని రోజా అవ్వకు హెచ్చరిస్తున్నాం. జోగి రమేష్ కి పవన్ ని చూస్తే ప్యాంట్లు తడిసిపోతున్నాయి అంటాడు. మంత్రులు బాగా యాక్టింగ్ లు చేస్తున్నారు. రోజా అవ్వ ఎయిర్పోట్ లో జబర్దస్త్ షో చేసింది. పోలీసు వ్యవస్థ అడ్డుకున్నది కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని. జగన్ కి పవన్ అంటే భయం, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిని అడ్డుకోవాలని చూశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. మంత్రులకు వాళ్ళ శాఖపై అవగాహన లేదు. పవన్ పై విమర్శలు చేయడం, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించడం రోజా అవ్వకు బాగా తెలుసు. వైజాగ్ లో పవన్ కి ఉన్న ఆదరణ చూడలేక, కడుపు మంటను ఇలా పోలీసులతో అక్రమ అరెస్ట్ లు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కిమ్ లా జగన్ పరిపాలిస్తున్నాడు, ఆంధ్ర కిమ్ జగన్ పోలీసు వ్యవస్థలో వైసిపి కి తోత్తుల్లా ఉన్న వారిని గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి వస్తూనే వారి పనిపడతాం. ఏపిలో గంజాయి, రెడ్ శాండిల్ ఎలా అక్రమ రవాణా ఎలా జరుగుతోందో కేంద్రమే చెప్పింది.