జనసేన ఆధ్వర్యంలో నివాళులు

నెల్లూరు, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మిని బైపాస్ వద్దనున్న జ్యోతిరావు పూలే విగ్రహానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు మంగళవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అసమానతలు, సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు మహాత్మ జ్యోతిరావు పూలే చివరి శ్వాస వరకు పనిచేశారని కొనియాడారు. మహిళలకు విద్యను అందించేందుకు మహాత్మ జ్యోతిరావు పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా విశేషమైన కృషి చేశారని ఆ ఫలితంగానే నేటి మహిళలు విద్య నేర్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.