జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో కుందూరు పద్మా వెంకట్రావు ఆధ్వర్యంలో 25వ డివిజన్ పప్పులమిల్లు ప్రాంతంలో మనకాకినాడ లోనే కావాలి మన నివాసానికి ఇల్లు అందుకు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ గత పదిరోజులుగా స్థానిక ఎం.ఎల్.ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బస్సులు వేసి కొంతమంది పేదలని తీసుకెల్లి పట్టాలిచ్చామని గొప్పగా చెపుతున్నారనీ, ఆ ఇచ్చిన పట్టాల్లో ఉండే అవకాశం ఉందా దానికి రోడ్లు ఉన్నాయా డిసెంబరు 2025కి ఇళ్ళు కడతామని చెపుతున్నారనీ అప్పుడు ఉండబోయే ముఖ్యమంత్రి ఎవరు, అప్పటికి ఉండే ఎం.ఎల్.ఏ ఎవరు, మీ పదవీ కాలం ఇంకొక్క ఇరవై రోజులు కాదా అబద్దాలు చెప్పి, మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళు ఏమీచేయకుండా ఉండి ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈపాటికి ఇళ్ళు కట్టి పేదలకి అందచేసేవారనీ ఇలా చేయరన్నారు. కాకినాడలో ఉన్నవారికి కాకినాడలో ఇవ్వకుండా ఎక్కడో వేరే గ్రామంలో ఇవ్వడం దారుణం అన్నారు, కాకినాడ ప్రజలకు కాకినాడలోనే ఇళ్ళు కావాలి అది వారి హక్కు అనీ దానికోసం వీరితరుపున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు సాధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కుందూరు పద్మ, గోవిందు, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్, నీలం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.