వసంత కృష్ణ ప్రసాద్ విజయమే లక్ష్యంగా కృషి చేస్తాం: పోలిశెట్టి తేజ

మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయానికి తమ వంతు బాధ్యతగా ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల మరియు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ ఇబ్రహీంపట్నం మండలంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు గ్రామంలో పోలిశెట్టి తేజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థులు అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ని, కేశినేని చిన్ని గెలిపించాలని తమ విలువైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కేతేపల్లి సుబ్బారావు, జనసేన నాయకులు జగదీష్, పూర్ణచంద్రరావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.