బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరిన రాధేయపాలెం యువత

  • రాధేయపాలెం గ్రామానికి చెందిన 30 మంది యువకులు బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిక
  • “కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం” అనే నినాదంతో

రాజానగరం నియోజకవర్గం: అధికార వై సి పి పార్టీ ఆగడాలను, అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆవిర్భవించిన జనసేన పార్టీ, మరియు జనసేన పార్టీ అధినేత, ప్రియతమ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి బుధవారం రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామానికి చెందిన యూత్ 30 మంది యువకులు కుల మతోన్మాద రాజకీయ శక్తులు కలగలసిన వైసీపీని గద్దెదించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న – ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు అండగ నిలబడుతున్న జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.