పతంజలి శాస్త్రికి అభినందనలు

కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైన రచయిత శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు…’ అనే కథా సంపుటానికి ఈ పురస్కారం దక్కడం ముదావహం. రచయితగానే కాకుండా పర్యావరణవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేశారు. చిత్తడి నేలలను కాపాడాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. శ్రీ పతంజలి శాస్త్రి గారు రాసే వ్యాసాలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియచేస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసే పోరాటానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని జనసేనాని కోరారు.