నూజివీడు జనసేన ఆధ్వర్యంలో 100 రోజులు 100 సమస్యలు

నూజివీడు: నూజివీడు జనసేన 100 రోజులు 100 సమస్యలు కార్యక్రమంలో భాగంగా దివంగత మాజీ మంత్రివర్యులు పాలడుగు వెంకట్రావు తన తల్లిదండ్రులైన పాలడుగు లక్ష్మణ్ నాగరత్నం దంపతుల పేరుమీద తాను నివాసం ఉండే భవనాన్ని కిసాన్ భవన్ గా నూజివీడు రైతాంగానికి ఉపయోగపడే ఉద్దేశంతో నూజివీడు మామిడి పరిశోధన కేంద్రానికి విరాళంగా ఇస్తే ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఆ భవనం యొక్క దుస్థితిని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. వెంకట్రావు గారు ఏ ఉద్దేశంతో అయితే రైతాంగానికి ఉపయోగపడాల్సిన భవనాన్ని నిరుపయోగంగా పడేయకుండా దాన్ని అవసరమైతే నూజివీడు ప్రెస్ క్లబ్ కి విరాళంగా ఇవ్వాలని జనసేన నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నూజివీడు నియోజకవర్గం ముఖ్య నాయకులు ముత్యాల కామేష్, ముమ్మిలనేని సునీల్ కుమార్, నూజివీడు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఇంటూరి చంటి, 6 వ వార్డు జనసేన పార్టీ నాయకులు నాయుడు శ్రీనివాసులు వంగముడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.