వేలేరుపాడులో జనం కోసం జనసేన 103వ రోజు

  • నిర్వాశితులను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం

పోలవరం నియోజకవర్గం: వేలేరుపాడు మండలంలో జనం కోసం జనసేన 103వ రోజు కమ్మరి గూడెం, మేడేపల్లి గ్రామాల్లో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రతి ఇంటికి వెళ్లి నిర్వాసితుల సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రభుత్వం నిర్వాసితులను ఎంత మోసం చేస్తుందో వారికి వివరిస్తూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసే సంక్షేమ పథకాలు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలని విషయం గురించి, ఆయన చేసిన మంచి పనులను వివరిస్తూ రాబోయే రోజుల్లో రానున్న మార్పులు వివరిస్తున్నారు. నిర్వాసితులకు విద్యార్థులకు, పేదలకు, అందరికీ పార్టీ అండగా ఉంటుందని, అధికారమనేది పాలించడం కోసం కాదని, ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమేనని స్థానిక ఎమ్మెల్యేకి బుద్ధి వచ్చేలా చేయడం కోసం గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు వీడ్కోలు పలకాలన్నారు. దేవి రెడ్డి సుధాకర్, చిచ్చుడి ప్రసాద్, కోట్ల మోహన్, సోడే కళ్యాణ్, కారం గణేష్, కుంజ శంకర్, వీరమహిళలు పొడియం తులసి, బండారు కళావతి, జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేశారు.