కరోనా వలయంలో చేరిన 17 మంది ఎంపిలు
ఈరోజు నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎంపిలందరికీ ఈ నెల 13న లోక్సభ, రాజ్యసభ సభ్యులకు కొవిడ్ టెస్ట్లు చేయించగా రిపోర్ట్స్ వచ్చాయి. వీరిలో 17 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో బిజెపికి 12 మంది ఎంపిలు కాగా వైఎస్ఆర్సిపి ఎంపిలు ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ పార్టీలకు చెందిన ఎంపిలు ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. కాగా దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపిలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా మరో 17 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.