జనసేన-గిరిసేన 52వ రోజు

పాలకొండ, జనసేన-గిరిసేన 52వ రోజు కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం మండ గ్రామంలో జనసేన గిరిసేన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో గిరిజన నేత సీనియర్ రాజకీయ నాయుకులు ఎక్స్ జడ్పిటిసి పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ పాల్గొని ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తులు గురించి ఎవ్వరు అలోచించ కుండా పాలకొండ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మాత్రమే మనం అలోచించాలి అని అలానే గ్రామ యువత మంచిగా చదువుకోవాలి, క్రీడాకారులుగా ఎదగాలి అని యువత ఏలాంటి ఆల్కహాల్ కి బానిసలు కాకుండా,మంచి సమాజం ఇంటి నుంచే రావాలి అని, ఈ సందర్బంగా జనసేన గుర్తు గాజు గ్లాస్ ని చూపిస్తూ, పార్టీ సభ్యత్వ కార్డును ఇవ్వడం,పవన్ కళ్యాణ్ గారు మనోగతం ఒక్కసారి చదవండి అని ఆయన ఈ సమాజం కోసం ఎంతలా అలోచిస్తున్నారో అర్ధం అవుతుంది అని తెలియజేశారు కనుక 2024లో కచ్చితంగా పాలకొండ నియోజకవర్గంలో జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించడానికి జనసేన సిద్ధంగా ఉండాలి అని నిబ్రమ్ పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు సవర సింహాద్రి ఈశ్వర్( కోటి) స్థానిక నాయకులు రాజేష్ గణేష్ సూరిబాబు పాల్గొన్నారు.