పవనన్న ప్రజా బాట 69వ రోజు

ఒంటిమిట్ట: జనసేన పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని రాటాల రామయ్య అన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు గురువారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండల పరిధి మండపంపల్లె పంచాయతీలోని రామచంద్రాపురం కాలనీలో 69 వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి ఆదరణ రావడం తమను ఎంతో ఉత్సాహ పరుస్తుందన్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుందని, చిత్తశుద్ధి నిబంధత కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.