జనం కోసం జనసేన మహాయజ్ఞం 711వ రోజు కార్యక్రమం

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 711వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 712వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. మరియు మధ్యాహ్నం 2 గంటలకు జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామంలో అధ్వానమైన రోడ్లపై డిజిటల్ కాంపైన్ నిర్వహించుట. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు.
ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కడప జిల్లా బద్వేల్ నుండి వచ్చిన తోట బాలచంద్రుడు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, చెక్కపల్లి సతీష్, కర్రి బాబ్జి, నల్ల శివ, కేసవరపు శివ, నాయకంపల్లి గ్రామ అధ్యక్షుడు అల్లాడి వీరబాబు, జె.కొత్తూరు నుండి పుగమళ్ళ పెద్దకాపు, యర్రంపాలెం నుండి రొట్టే రామకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కుండ్లమహంతి చక్రరావు, కోడి గంగాధర్, పిన్నం మణికంఠ కృతజ్ఞతలు తెలిపారు.