ఆక్వా రైతుల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆక్వా రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30.11.2022 బుధవారం ఉదయం 10.00 గంటలకు అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పితాని బాలకృష్ణ ముమ్మిడివరం జనసేన కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7నియోజకవర్గాల జనసేన పార్టీశ్రేణులు, జనసేన పార్టీనాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు ఆక్వా రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లిఖార్జునరావు, గోదాశి పుండరీష్, జక్కంశెట్టి పండు, దూడల స్వామి, మాదాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.