పోలవరంలో జనం కోసం జనసేన 91వ రోజు

పోలవరం నియోజకవర్గం: కోయల గూడెం మండలం రాజవరం గ్రామంలో జనం కోసం జనసేన 91వ రోజు కార్యక్రమాన్ని ఆదివారం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టోను జనసేన పార్టీ చేసేటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ చిరి బాలరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 2024లో తప్పకుండా గద్దిదించాలని లేకపోతే మన రాష్ట్రం అదా పాతాళానికి పడిపోతుందని ప్రజలందరూ కూడా వైసిపి పాలనకి చరమగీతం పాడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు సమస్యల గురించి మాట్లాడితే అరెస్టులు కేవలం కక్షపూరిత రాజకీయాలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆలోచించట్లేదని కేవలం ఓటుని డబ్బుతో కొనవచ్చు అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదని 2024లో ఉమ్మడి పార్టీల కార్యచరణతో వైసిపి పార్టీని ఓడించడం ఖాయమని పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు తోట రవి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజవరం గ్రామ కమిటీ అధ్యక్షులు అనంతల శ్రీను, ఉపాధ్యక్షులు గర్సికూటి, చిన్ని కొయ్యలగూడెం మండల ఉపాధ్యక్షులు కసుకుర్తి ఉమా, మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్ మల్లా బత్తుల రాము, మల్లా బత్తుల శ్రీనివాష్, కర్రీ నాగేశ్వరరావు, మల్లా బత్తుల దుర్గారావు, కోన రాజకుమార్, కోన రాంబాబు, మండల కార్యదర్శి వరికూటి ప్రకాష్, మోదుగ గంగాధర్, పొంగుటూరు గ్రామ కమిటీ అధ్యక్షులు గేలం సూర్య భాస్కర్, ప్రగడ సురేష్, ప్రగడ లక్ష్మణ దొర, బూరుగు వెంకన్న, కొప్పుల రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.