రోడ్డు ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తను పరామర్శించిన గాదె

పెదకూరపాడు నియోజవర్గం: బలుసుపాడు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వామనపల్లి ఆదినారాయణ రోడ్డు ప్రమాదానికి గురైనాడు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు హాస్పటల్ కి వెళ్లి కార్యకర్త ఆదినారాయణను కలిసి, వారికి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.