వారాహి యాత్రను విజయవంతం చేయండి: బొమ్మిడి నాయకర్
నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ వారాహి యాత్ర సన్నాహక సమావేశం నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వారాహి యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 23, 24వ తేదీలలో నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని నాయకర్ తెలియజేశారు. వారాహి యాత్రను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీరమహిళలకు పిలుపునిచ్చారు. ఈ యాత్రకు సంబంధించి నియోజకవర్గ నాయకులు, జనసైనికుల నుండి పలు ముఖ్య సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, మాదంశెట్టి కోటేశ్వరరావు, జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గంట కృష్ణ, గుబ్బల మార్రజు, ఆకుల వెంకటస్వామి, నిప్పులేటి తారకరామారావు, కోపల్లి శ్రీనివాస్, పెమ్మాడి కిరణ్, వాతాడి రమేష్ , పులపర్తి సూర్యనారాయణ, బందెల ఎలేషా, తోట నాని, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, భారతి సురేష్, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, పిప్పళ్ళ సుప్రజ, కారుమంచి జీవరత్నం, కొల్లా బత్తుల వెంకటేశ్వరరావు, బొమ్మిడి కృష్ణమూర్తి మరియు నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-18.20.12-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-18.20.11-1024x770.jpeg)